ఈవీ పాలసీ
స్కోడా ఇండియా ప్రస్తుతం భారత ప్రభుత్వ ఈవీ పాలసీ కోసం వేచి ఉంది. ఇది మార్చి 2025 నాటికి ఖరారు అవుతుందని భావిస్తున్నారు. దీని ప్రకారం కారు ధర సుమారు రూ.29 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, కంపెనీ భారతదేశంలో ఈవీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తే అప్పుడు కస్టమ్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ షరతులను నెరవేర్చకపోతే, ఈవీ దిగుమతులపై భారీ కస్టమ్ డ్యూటీ విధిస్తారు. స్కోడా, వోక్స్వ్యాగన్ కూడా సంయుక్తంగా భారతదేశం కోసం స్థానిక ఈవీ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తున్నాయి.