శ్రీకాకుళం జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగింది. ఆడుకుంటున్న బాలికకు వేరుశెనగ చెక్కి ఇచ్చిన నిందితుడు… ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక విషయం చెప్పటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.