రుద్రాణి వల్లే…
మీ మాటలు, ప్రవర్తనతో సీతారామయ్య మనసు విరిగిపోయిందని, వీళ్లకోసమేనా ఇన్నాళ్లు కష్టపడిందని కన్నీళ్లు పెట్టుకున్నాడని, తన మనషులే తనను పరాయివాళ్లను చేయడం చూసి తట్టుకోలేకపోతున్నాడని ఇందిరాదేవి ఎమోషనల్ అవుతాడు. రుద్రాణి వల్లే ధాన్యలక్ష్మి ఇలా తయారైందని, ఒక్క కలుపు మొక్క వల్లే ఇళ్లు మొత్తం నాశనం అయ్యిందని అపర్ణ అంటుంది. ఇందులో ధాన్యలక్ష్మి, ప్రకాశం తప్పు లేదని అపర్ణ చెబుతుంది. అపర్ణ మాట్లాడుతుండగానే ప్రకాశం వెళ్లిపోతాడు. అతడు మారుతాడనే నమ్మకం లేదని, ఎవరి దారి వారు చూసుకోవాల్సిందేనని ఇందిరాదేవి అంటుంది.