హాస్య నటుడు పృథ్వీ రాజ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు తనని టార్గెట్ చేశారని ఆరోపించారు. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధించారని అన్నారు. ఈ వేధింపులపై ఆయన కుటుంబ సమేతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.