మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయన్నారు.