ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత కథ ముగిసింది. ఎలాంటి పతకం లేకుండా వట్టి చేతులతో భారత్ ఇంటి ముఖం పట్టింది. క్వార్టర్స్ లో మన జట్టు 0-3 తేడాతో మాజీ ఛాంపియన్ జపాన్ చేతిలో ఓటమి పాలైంది. మిక్స్ డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ, పురుషుల సింగిల్స్ లో హెఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోద్ పరాజయం చెందారు. ఈ టోర్నీలో 2023లో కాంస్యం గెలిచిన భారత్ ఈ సారి సెమీస్ కూడా చేరలేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here