ప్రభుత్వంపై ఆర్థిక భారం
ఆధార్ నెంబర్ ఆధారంగా ఎక్కడేనా వారి పేర్లు ఇతర రేషన్ కార్డులో ఉన్నాయా అని విషయాన్ని సివిల్ సప్లై అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తులు వచ్చినా.. తొలి దశలో ఒక్కరినే చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చిన వారికి 6 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వంపై ఏడాదికి రూ.32 కోట్ల ఆర్థిక భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.