ప్రధాన నగరాలకు రైళ్లు..
సికింద్రాబాద్ నుంచి నిత్యం ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వందలాది రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ 10 ఫ్లాట్ఫాంలు, 11 ట్రాక్లు ఉన్నాయి.