చక్రధర్ ఫిర్యాదుతో..
మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆధారాలు లభించడంతో అరెస్టులు ప్రారంభించారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేసిన టి.వంశీకృష్ణ, అతడికి సహకరించిన టి.సంతోష్కుమార్, బి.పరశురాములును అరెస్టు చేశారు.