కమిటీ ఏర్పాటు..
విద్యార్థుల ఫిర్యాదు, బ్లడ్బ్యాంక్ సిబ్బంది ఆరోపణలు జీజీహెచ్లో కలకలం సృష్టించాయి. దీనిపై గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి సుందరాచారి స్పందించారు. విద్యార్థులు, సిబ్బంది ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించామన్నారు. ఆ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.