ఏఏ జిల్లాల నుంచి ఎన్ని బస్సులు?
శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి ఉమ్మడి కర్నూలు జిల్లా 198 బస్సులు, అనంతపురం జిల్లా నుంచి 60 బస్సులు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 45 బస్సులు, కడప జిల్లా నుంచి 10 బస్సులు, నెల్లూరు జిల్లా నుంచి 60 బస్సులు, చిత్తూరు జిల్లా నుంచి 20 బస్సులు, తిరుపతి జిల్లా నుంచి 40 బస్సులు, అన్నమయ్య జిల్లా నుంచి 20 బస్సులు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా 198 బస్సుల్లో కర్నూలు-1 నుంచి 29, కర్నూలు-2 నుంచి 31, పత్తికొండ నుంచి 3, ఎమ్మిగనూరు నుంచి 23, ఆళ్లగడ్డ నుంచి 10, ఆత్మకూరు నుంచి 5, బనగానపల్లి నుంచి 10, డోన్ నుంచి 15, కోవెలకుంట్ల నుంచి 14, నందికొట్కూరు నుంచి 18, నంద్యాల నుంచి 16, ఆదోని నుంచి 24 బస్సులు నడపనున్నారు.