తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో లబ్ధిదారులకు వీలైనంత ఎక్కువ మేలు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని తక్కువ ధరకు ఇప్పించేలా చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది.