ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అన్ని మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. మిగిలిన మ్యాచ్లు పాకిస్థాన్లో జరగనున్నాయి. ఎనిమిది జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఉండనుంది.