బాలికకు 20 రూపాయలు ఇచ్చి..
పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి.. బాలిక, అలాగే కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్, ఎస్ఐ డి.జ్వాలా సాగర్ ఆధ్వర్యంలోని బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే.. పోలీసులు కేసు నమోదు చేసి, తన కోసం గాలిస్తురన్న విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్.. ఆ బాలికకు రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్రవంతెన వద్ద గ్రామానికి వెళ్లే బస్సు ఎక్కించాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు.