ఆదాయ పన్ను శాఖ వివరణ
అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి, పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళానికి దారి తీయడంతో, దీనిపై ఆదాయ పన్ను శాఖ వివరణ ఇచ్చింది. రీఫండ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ‘‘ప్రియమైన @taxguru_in, మా ఎఫ్ఎక్యూలలో వివరించినట్లుగా, కొత్త ఆదాయ పన్ను బిల్లు, 2025 లో రిఫండ్స్ కు సంబంధించిన నిబంధనలలో విధానపరమైన మార్పులు ఏవీ లేవు’’ అని ఆదాయ పన్ను శాఖ తమ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 239 ప్రకారం రిటర్న్ ఫైలింగ్ ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఎప్పటి నుంచో ఉందని, ఇప్పుడు కొత్త బిల్లులోని సెక్షన్ 263(1)(9)లో కూడా ఇది ప్రతిబింబిస్తుందని ఐటీ విభాగం తెలిపింది. ‘‘రీఫండ్ క్లెయిమ్ ల కోసం రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని మాత్రమే ఈ బిల్లు బలపరుస్తుంది.అంతేకానీ, కొత్త పరిమితులను ప్రవేశపెట్టదు’’ అని ట్యాక్స్ 2విన్ సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ అన్నారు.