ప్రయాణికుల ఇబ్బందులు..
ఎలమంచిలిలో ఏపీ ఎక్స్ప్రెస్, గరీబ్రథ్, రత్నాచల్, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించునే వారు లేదు. ఎలమంచిలి స్టేషన్ నుంచి రోజూ 2 నుంచి 3 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే.. ఇటీవల అధికారులు వివిధ కారణాలతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. మచిలీపట్నం ఎక్స్ప్రెస్, రాయగడ, కాకినాడ, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను వచ్చేనెల వరకు నిలిపివేశారు. రోజుల తరబడి రైళ్లను రద్దు చేయడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.