ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్‌తోపాటు మరికొన్ని పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు పవన్‌కు కొన్ని సూచనలు చేశారు. ఇవే కాకుండా మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ నెలాఖరున గానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలి వైద్య పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది. అలాగే ఈనెల 24న ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలకు పవన్‌కళ్యాణ్‌ హాజరవుతారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here