శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపి… రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది. అయితే వీరి జాడను పట్టుకోవటం అతిపెద్ద సవాల్ గా మారింది. సొరంగం లోపల నీళ్లు, బురుద పేరుకుపోవటంతో…. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవటం ఇబ్బందికరంగా మారింది.