ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై మన జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే పాక్ అభిమానులకు ఈ ఓటమి కలచి వేసింది. పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ లోపాన్ని ఎత్తిచూపుతూ జట్టు తీరుపై అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు.