ఇంజినీరింగ్ కోర్సులతో పాటు వృత్తివిద్య కోర్సుల్లో జరిగే అడ్మిషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. మరో 15 శాతాన్ని అన్ రిజర్వ్డ్ కోటాగా పరిగణించింది. ఇందులోనూ కొన్ని మార్గదర్శకాలను పేర్కొంది.