టీజీఎండీసీ ద్వారానే సరఫరా
ఈ సందర్భంగా ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు.