పన్నుల భారం లేకుండా..
నాన్ టాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వం తాజాగా.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. అటు కేంద్రం నుంచి కేవలం పన్నుల వాటా, ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.