సమాఖ్యలకు ఆదాయం..
ప్రస్తుతం ప్రభుత్వం మండల సమాఖ్యలకు బస్సులు అందజేస్తోంది. తొలుత 150 మండలాలకు అందివ్వనున్నారు. వీటి పనితీరు, ఆదాయం పరిశీలన తర్వాత అన్ని మండలాలకు విస్తరింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అద్దె చెల్లిస్తున్నారు. ఇప్పుడు మండల సమాఖ్యలకు ఇవ్వడం ద్వారా ఆ ఆదాయం మహిళలకు వెళ్లనుంది. మండల సమాఖ్యల అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు, కోశాధికారులు వీటిని పర్యవేక్షించే అవకాశం ఉంది.