పూడిమడకలో విషాదఛాయలు..
మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్యుతాపురం ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపారు. విచారణ పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మృతి చెందిన యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. మరోవైపు లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కుటుంబం కూడా విషాదంలో ఉంది. ఈ ఘటనతో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.